– డిప్యూటీ కలెక్టర్ అపర్ణ, డీడబ్ల్యూఓ ప్రమీల
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 11 : బాలికలు, కిశోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి పాటించాలని డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, జిల్లా సంక్షేమ అధికారి కె.ప్రమీల అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీ డబ్ల్యూ ఆర్ ఈ ఎస్ – కూసుమంచికి చెందిన వసతి గృహంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన డిప్యూటీ కలెక్టర్, డీడబ్ల్యూఓ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కిశోర బాలికలకు విద్యతో పాటు ఆరోగ్య, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలికలు రుతుస్రావ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చేతులు కడుక్కోవడం, శుభ్రమైన నీటిని వినియోగించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చున్నారు.
రక్తహీనత నివారణకు ఐరన్, పోలికి యాసిడ్ కలిగిన ఆకుకూరలు కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్త శ్రావణం ఎక్కువ రోజులు కొనసాగితే వైద్యులను సంప్రదించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కనకదుర్గ సూచించారు. రుతు శ్రావణ సమయంలో జ్ఞాపకంలను మార్చడం తప్పనిసరి అన్నారు. ఇలాంటి సమయంలో బాలికలు పాఠశాలకు దూరం కాకుండా కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు, సమాజం సహకరించాలన్నారు. వారి విద్య నిరంతరాయిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె.సరిత, షీ టీం, విభాగాల సభ్యులు సమ్రీన్, ప్రమీల, వాసంతి తో పాటు ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

‘కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి’