ఖమ్మం, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 18వ తేదీన లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్దత్తో కలిసి లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల స్రూట్నీ ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్లో హెల్ప్డెస్ ఏర్పాటు చేసి నామినేషన్ ఫారాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థి దేశంలో ఎకడైనా ఓటరుగా నమోదై ఉండాలని, ప్రపోజర్లు ఆయా నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదై ఉండాలన్నారు. ఓటరు జాబితాలో ఓటరుగా నమోదైనది, లేనిదీ తనిఖీ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ, ఆలస్యం చేయక వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన 52987 ఎపిక్కార్డులు పంపిణీ చేశామని, 54,866 కార్డులు ప్రింటింగ్ కోసం ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని 1,459 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు.
కనీస సౌకర్యాల కల్పనతో పాఠశాలలు బాగుపడతాయన్నారు. 600 పోలింగ్ కేంద్రాల్లో బాత్ రూమ్ కమ్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 3,620 మంది పీవో, ఏపీవోలకు శిక్షణ ఇచ్చామని, ఈవీఎంల నిర్వహణ పై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణా కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్లు, ఈడీసీలు ఎన్నికల విధుల సిబ్బంది నుంచి తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ చివరివారంలో రెండో శిక్షణ ఉంటుందన్నారు. జిల్లాకేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల పరిషారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్దత్ మాట్లాడుతూ జిల్లాలో 12 ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు, 15 ఎస్ఎస్టీ, 15 ఎఫ్ఎస్టీ, పోలీసుల ద్వారా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 54 కేసులు నమోదు చేసి 359 లీటర్ల మద్యం, కిలో గంజాయి, 77లక్షల 10వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. రూ.50 వేలకు పైబడి నగదుతో ప్రయాణిస్తున్నప్పుడు సంబంధిత నగదు డాక్యుమెంట్లు వెంట ఉండాలన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ను కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. సమావేశంలో జడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీఆర్వో ఎంఏ గౌస్, అధికారులు పాల్గొన్నారు.