బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో మంచి మ్యానిఫెస్టోగా ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రూ.400లకే గ్యాస్బండపై మహిళలు సంబురపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి వీపుపై గ్యాస్”బండ’ బరువును పెంచుకుంటూ పోయింది. మోయలేని భారంతో ఉన్న పేదప్రజలు సీఎం కేసీఆర్ ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ ‘కేసీఆర్ బీమా’ పేరుతో రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇవ్వడం గొప్ప వరంగా భావిస్తున్నారు. ఇది నిరుపేదలకు దీమా కల్పిస్తుందని పేర్కొంటున్నారు. ఏ గ్రామంలో చూసినా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయి. ఎవరినోట విన్నా అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి రావాలని కోరుతున్నారు.
బంగారురోజులు వచ్చాయి.. తెలంగాణలో బంగారురోజులు వచ్చాయి. వంటింటి కష్టాలు తప్పాయి. నేడు దేశం మొత్తంలో భగ్గుమంటున్న గ్యాస్బండ ధరలను పట్టించుకోకుండా తెలంగాణ మహిళలకు రూ.400 గ్యాస్ ఇవ్వడం అద్భుత పథకం. గత వారంరోజుల క్రితం రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇతర రాష్ర్టాల మహిళలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి పొగుడుతున్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన బాగుందని కితాబిచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బతుకమ్మ పండుగకు చీరెలతోపాటు మ్యానిఫెస్టోలో అమలుచేస్తామన్న గ్యాస్ ధర, పేద మహిళలకు నెలకు రూ.3 వేల భృతి పథకాలు కూడా మా రాష్ట్రంలో ఉంటే బాగుంటుందని అంటున్నారు. ఇంత గొప్ప నాయకుడు మన తెలంగాణ రాష్ర్టానికి సీఎంగా ఉండడం ప్రతి మహిళకు గర్వకారణం. సీఎం కేసీఆర్ చేసేదే చెప్తారు.. చెప్పిందే చేస్తారు. నిజమైన పరిపాలన దక్షత కలిగిన నాయకుడు కేసీఆరే.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో పేద ప్రజలను రజింపచేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగుచెంది ఉన్నారు. ఈ క్రమంలో రూ.400కే గ్యాస్బండ ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇవ్వడంతో మళ్లీ కేసీఆర్కే ఓటు వేస్తామని అంటున్నారు. గ్యాస్ ధరల తగ్గింపు ప్రకటనతో సామాన్యజనం సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో ఐదుసార్లు గ్యాస్ ధరలు పెంచిన కేంద్రంపై విసుగుచెందిన ఆడపడచులు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ఆనందపడుతున్నారు.
మంచి మ్యానిఫెస్టో ప్రకటించారని, కేసీఆర్ బీమా పథకం పేద కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఎవరి నోట విన్నా సర్కారు సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అమలు జరగాయని మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.
పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల బతుకులను అణిచివేయడంపై జనం గుర్రుగా ఉన్నారు. గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యితో వంట చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికేడాది గ్యాస్ ధరలు పెంచడంతో కుంగిపోతున్నారు. దీంతోపాటు నిత్యావసర ధరలు సైతం ధరలు పెంచడంతో సామాన్యజనం నడ్డివిరిచినట్లయిందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేదవర్గాల సమస్యలను అర్థం చేసుకుని గ్యాస్బండ ధర తగ్గింపు ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబం యజమాని అనుకోకుండా మృతిచెందితే ఆ కుటుంబానికి బీమానే ఆదుకుంటుంది. అలాంటి బీమా సౌకర్యాన్ని ‘కేసీఆర్ బీమా’ పేరుతో తెలంగాణ సర్కారు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో దీనిని ప్రకటించడంతో ఆయా కుటుంబాలకు భరోసా కల్పించినట్లయింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోతే పిల్లలను ఆదుకోవడం ఎవరితరం కాదు. అలాంటి కుటుంబాలకు ఆసరాగా బీమా పథకం ఎంతగానో ఉపయోగపడనున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇన్నాళ్లూ గ్యాస్ ధరలను అమాంతం పెంచింది. రోజు రోజుకూ పెంచడమే తప్ప తగ్గించడం చేయలేదు. కొన్ని రాష్ర్టాల్లో ఎన్నికల పుణ్యమా అని ఇటీవల రూ.200 మేర తగ్గించినా పెద్దగా ఫలితం లేదు. ఎందుకంటే అప్పటికీ సుమారు రూ.1000 పలుకుతోంది. దీంతో సామాన్యులు గ్యాస్ వాడడం తగ్గించి కట్టెల పొయ్యినే వాడుతున్నారు. ఇలాంటి పేదల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్.. తాము మరోసారి అధికారంలో వస్తే గ్యాస్ సిలిండర్ను రూ 400కే ఇస్తామంటూ తమ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే గ్యాస్ ధర తగ్గించడం ఖాయం.
రైతు కుటుంబానికి అండగా సీఎం కేసీఆర్ ఉన్నారు. రైతుబీమాతో ఎంతగానో ఆదుకుంటున్నారు. నా భర్త పేరుతో 16 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రమాదవశాత్తూ ఆయన 2019లో చనిపోయాడు. దీంతో మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. చాలా కుంగిపోయాం. తరువాత వ్యవసాయ అధికారులు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం. నామినీగా ఉన్న నా ఆధార్ కార్డు తీసుకెళ్లారు. వారం రోజుల్లోనే నా బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షల బీమా పరిహారం జమ అయింది. మా కుటుంబానికి ఇది ఎంతో వెన్నుదన్నుగా నిలిచింది. నేను కూడా ఒక మహిళా రైతుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాను. ఎందుకంటే రైతులకు వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ ఉన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చి రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తే మా లాంటి పేదలకు పెద్ద ఊరట లభించినట్లే. పేదలకు ఉపయోగకరమైన గ్యాస్ ధరను తగ్గిస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించడం గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పటికే అమాంతం పెరిగిన గ్యాస్ ధరలతో మా లాంటి పేదలం అనేక ఇబ్బందులు పడుతున్నాం. గ్యాస్ ధర తగ్గితే కుటుంబ ఖర్చు చాలా వరకూ ఆదా అయినట్లే.
ఎన్నికల ముందు విడుదల చేసిన సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రజాదరణ పొందుతుంది. మా గ్రామంలో పథకాలపై ప్రతిరోజూ చర్చే. నలుగురు మహిళలు కూర్చున్న చోటల్లా సీఎం కేసీఆర్ను పొగుడుతున్నారు. పేద మహిళలకు నెలకు రూ.3 వేలు, గ్యాస్పొయ్యి రూ.400, కుటుంబానికి కేసీఆర్ బీమా రూ.5 లక్షలు, ఆరోగ్యరక్ష రూ.15 లక్షలకు పెంపు, రేషన్పై సన్నబియ్యం, ఆసరా పెన్షన్ రూ.5 వేలకు పెంపు, స్వశక్తి గ్రూపులకు భవనాలు తదితర వాటిని మహిళల సంక్షేమానికే ప్రవేశపెట్టారు. ఇంతకన్న మహిళలకు ఇంకేం కావాలి. దేశంలో ఎక్కడాలేని మహిళా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. మరికొన్నింటిని ఎన్నికల తరువాత ప్రవేశపెడతారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణ మహిళలు ఆర్థికంగా, జీవనపరంగా, ఆరోగ్యపరంగా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ అబ్బాయిలకు ఇతర రాష్ర్టాల అమ్మాయిల పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో అమ్మాయిలను ఇచ్చేందుకు ఉత్సుకతో ఉన్నారు. ఇది తెలంగాణకే గర్వకారణం.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా మాట వినిగానే.. రైతుబీమా పథకం గుర్తుస్తోంది. మా గ్రామంలో ఇటీవల చనిపోయిన ఓ రైతు కుటుంబానికి రూ.ఐదు లక్షల బీమా పరిహారం అందింది. ఆ నగదు ఆ కుటుంబాన్ని ఎంతలా ఆదుకుందో ప్రత్యక్షంగా చూశాను. అలాగే, మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కేసీఆర్ బీమా పథకాన్ని కూడా అమలు చేస్తే.. అనేక పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. రైతుబీమా పథకం విజయవంతమైనట్లుగానే.. కేసీఆర్ బీమా కూడా అద్భుతంగా విజయవంతమవుతుంది. ప్రజల్లో ఈ పథకానికి ఎంతగానో ఆదరణ లభిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వమూ అందించని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ బీమా పథకాన్ని అందించేందుకు రావడం గొప్ప విషయం. ఈ పథం పేద కుటుంబాలకు ధీమానిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పేదలందరూ ఆదరిస్తారు.
మాది మణుగూరు. మా తండ్రి సిరికొండ శ్రీనివాస్ ఉన్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ, ఆటో నడుపుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడునెలల క్రితం మా చెల్లెలు సిరికొండ ప్రియాంకను కొత్తగూడెం రుద్రంపూర్ వద్ద కళాశాలలో దింపి వస్తుండగా లారీ ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతుబీమా’ పథకంలో మా నాన్న పేరుతో నామినీగా ఉన్న నాకు రూ.5 లక్షలు ప్రమాదబీమా సొమ్ము చేతికి వచ్చింది. నా చెల్లెలు ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ చదువుతుండగా నేను కుటుంబపోషణ నిమిత్తం ప్లిఫ్కార్టులో పనిచేస్తున్నా. మా చిన్నతనంలోనే తల్లి నిర్మల చనిపోయింది. అప్పటినుంచి మా నాన్నతోపాటు నాయనమ్మ లక్ష్మి మమ్ములను పెంచుతున్నారు. వచ్చిన ప్రమాదబీమా సొమ్ము రూ.5 లక్షలను నా చెల్లి వివాహ నిమిత్తం ఎస్బీఐ బ్యాంకులో ఫిక్స్డ్ చేశాను. నాలాంటి పేద కుటుంబాల్లో ఇంటి పెద్దదిక్కు కోల్పోయినా కుటుంబానికి ఆసరాగా సీఎం కేసీఆర్ రైతుబీమా రూపంలో నిలిచారు. ఆ సొమ్ముతో నా చెల్లికి వివాహం చేసి సంతోషంగా అత్తారింటికి పంపుతా. కేసీఆర్ చేసిన మేలు జీవితంలో నా కుటుంబం మరువలేదు.
మాది నిరుపేద కుటుంబం. చిన్న వయసు నుంచీ కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసుకునేవాళ్లం. కొన్నేళ్ల క్రితం కేంద్రం ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. బాగానే ఉందని సంతోషించాం. తరువాత కట్టెల పొయ్యి జోలికి వెళ్లలేదు. గ్యాస్ మీదనే ఎక్కువగా వంటలు చేసుకునే వాళ్లం. తరువాతి కాలంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచుతూ వచ్చింది. క్రమంగా ధరను రూ.1200 వరకూ పెంచింది. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్న కారణంగా ఇటీవలే ఓ రూ.200 తగ్గించి రూ.1000 చేసింది. అయినప్పటికీ అంత వెచ్చించి గ్యాస్ కొనుగోలు చేసే శక్తి మాకు లేదు. దీంతో అప్పటి నుంచి గ్యాస్ పొయ్యిని పక్కన పెట్టేశాం. మళ్లీ కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నాం. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మ్యానిఫెస్టో మాకు ఎంతో ఊరటనిచ్చింది. బీఆర్ఎస్ మరోసారి అధికారంలో వస్తే పేదలకు రూ.400కే గ్యాస్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇంత తక్కువ ధరకు గ్యాస్ వస్తే మా ఇబ్బందులు తప్పినట్టే. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన వంటగ్యాస్ సబ్సిడీ పథకం అద్భుతం. ఈ పథకం అమలైతే గృహిణులకు సగం భారం తగ్గి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు మోయలేని భారంగా మారింది. గ్యాస్ అయిపోతుందంటేనే భయమేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో రూ.400లకే గ్యాస్ అందిస్తానని ప్రకటించడం హర్షణీయం. ఈ పథకం అమలైతే ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళలంతా రుణపడి ఉంటారు.
నా భర్త విజయ్ రైతు. కొంతకాలం క్రితం ఆయన అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతిచెందాడు. దీంతో మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. అప్పటికే ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరి ఆడపిల్లలు ఉన్నారు. వారి చదువులు, ఇంటి ఖర్చులు ఎలా అని దిగులు పడేదాన్ని. ఇంత పెద్ద కష్టానికి ఎలా ఎదురీదాలని మదనపడేదాన్ని. ఈ క్రమంలోనే ఆయన పేరు మీద ఉన్న పట్టాదారు పాస్ బుక్ గుర్తొచ్చింది. దీంతో వెంటనే రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నా. కొన్ని రోజుల్లోనే నాకు రూ.5 లక్షల బీమా పరిహారం అందింది. దీంతో నా కష్టాలన్నీ తొలగిపోయాయి.
పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు రావాలి కానీ పెద్దోళ్లకోసం కాదు. ప్రతి వస్తువుకు ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదు. పచ్చడి మెతుకులు తినాల్సిన పరిస్థితి వస్తదేమో. ఇంత రేటు పెట్టి గ్యాస్ బండ ఎలా కొంటాం. గ్యాస్ బండలు ఎప్పుడో అటకెక్కించాము. ఆ బండలుపైనే ఉంటున్నాయి. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కాని గ్యాస్ బండులు కిందకి దింపము.
చావు పుట్టుకలు చెప్పిరావు. ఉన్నట్టుండి ఏ కుటుంబంలోనైనా యజమాని చనిపోతే ఆ కుటుంబం ఆగమవ్వకూడదు. అందుకే సీఎం కేసీఆర్ బీమా పథకం పెట్టారు. రైతు బీమా కూడా మా దగ్గర రైతు కుటుంబాలకు బాగా ఉపయోగపడ్డాయి. ఎప్పటికైనా కీడెంచి మేలెంచాలి అంటారు పెద్దలు. అందుకే ఏ కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా బీమా పథకాలు ఉపయోగపడతాయి.
ప్రమాదాలు ఎవరికీ చెప్పిరావు. అనుకోకుండా కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకూడదని తెలంగాణ ప్రభుత్వం గతంలో రైతు కుటుంబాలకు మాత్రమే రైతుబీమా ప్రవేశపెట్టింది. ఈసారి ప్రతి కుటుంబానికి వర్తింపజేసేలా ‘కేసీఆర్ బీమా’ ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. ఇలాంటి బీమాలు పేద కుటుంబాలను ఆదుకుంటాయి. చావు ఎవరికీ చెప్పిరాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వ్యక్తులు అజాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబం అనాథ అవాల్సిందే. అందుకే తెలంగాణ సర్కారు ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1050 ఉంది. అన్ని డబ్బులు పెట్టి మేం దానిని కొనలేం. అందుకే కట్టెల పొయ్యిమీద వంట చేస్తున్నా. వర్షాకాలంలో ఇంటి బయట కట్టెల పొయ్యి మీద వంట చేయడం కుదరదు కాబట్టి అప్పటికి డబ్బులు పొగేసుకొని గ్యాస్ సిలెండర్ కొంటాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రూ.400 గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ఇటీవలే తమ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఆయనకు ఓటేస్తాం. ఆయన మళ్లీ సీఎం అయితే మాకు రూ.400కే గ్యాస్ వస్తుంది.
-మురహరి దుర్గ, భద్రాచలం
మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ ధర రూ.1175 ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గించి రూ.975కే వస్తోంది. ప్రస్తుతం గ్యాస్ అయిపోతే భయపడాల్సిన పరిస్థితి. ఒక మధ్య తరగతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్ అవసరం ఉంటుంది. ఇలాంటి క్రమంలో ప్రతి నెలా గ్యాస్కు రూ.వెయ్యి చెల్లించడం ఆర్థికభారంగా మారుతుంది. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించడం ఎంతో ఆనందకరమైన విషయం. సీఎం కేసీఆర్తోనే తెలంగాణకు మంచి జరుగుతుంది. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా గ్యాస్ ధరలను పెంచుతూ రూ.1200కు తీసుకొచ్చింది. ఇది మాలాంటి పేదలకు మోయలేని భారం. తగ్గించినప్పుడు కేవలం రూ.20 నుంచి రూ.50 వరకు మాత్రమే తగ్గిస్తోంది. పెంచినప్పుడు మాత్రం రూ.వందల్లో పెంచుతున్నారు. ఒకప్పుడు రూ.500 వరకు ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. దీంతో గ్యాస్ కొనలేక ఇబ్బందులు పడుతున్నాం. పండుగ వచ్చిందంటే చాలు పిండి వంటలు చేసుకోవాలంటే కట్టెలనే వాడుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జరిగే ఎన్నికల మ్యానిఫెస్టోలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 చేస్తామని ప్రకటించారు. ఈ మాట పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. మాలాంటి గృహిణులకు గొప్ప శుభవార్త ఇది. తెలంగాణ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే కచ్చితంగా చేస్తుంది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ చేశారు. కొన్నిసార్లు చెప్పనివి కూడా చేశారు. సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే కచ్చితంగా చేసి చూపిస్తారు.
ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మాకు మాత్రం బొగ్గుల పొయ్యి తప్పడం లేదు. కేంద్రంలో ఏ సర్కారు వచ్చినా గ్యాస్బండ ధరలు మాత్రం తగ్గించడం లేదు. ఉచితంగా గ్యాస్ బండలు ఇచ్చినా ఉపయోగం లేదు. గ్యాస్ రేటు ఇప్పటికి నాలుగుసార్లు పెంచారు. అప్పుడు రూ.350 ఉండేది. ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటింది. అందుకే కట్టెల తెచ్చుకుని వంట చేసుకుంటున్నాం. పండుగలు వస్తే పొయ్యి దగ్గరే ఉండాల్సి వస్తుంది. మళ్లీ బీఆర్ఎస్ సర్కారు వస్తేకాని గ్యాస్ ధరలు తగ్గవు. 400 ఇస్తున్నామని చెప్తున్నారు వాల్లనే మేము నమ్ముకుంటాము.
సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళల సంక్షేమానికే పెద్దపీట వేశారు. ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడారు. తెలంగాణలో మహిళలకు ఉన్న స్వేచ్ఛ, సంరక్షణ, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను చూసి దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తుంది. కట్టెల పోయ్యి మీద నుంచి గ్యాస్ పొయ్యికి వచ్చిన తరువాత మహిళలకు కష్టాలు తప్పాయి అనుకున్నా. కానీ బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు పెంచుతున్న గ్యాస్ ధరలతో మళ్లీ తిరోగమనంలోకి వెళ్లాం. కట్టెలపొయ్యి మీద వంటలు, అవసరమైన పనులు చేసుకుంటున్నాము. కళ్లు మండిపోతున్నాయి. గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలు చేయలేకపోతున్నాం. మ్యానిఫెస్టోలో ఆడవారి కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ గ్యాస్ పొయ్యి ధర రూ.400లకే నిర్ణయించడంతో మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నది. నిజంగా నేను బతికున్నంతకాలం సీఎంగా కేసీఆర్ని చూడాలని ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ బీమా’ పథకంతో రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే బీమా సొమ్ము చెల్లించి వారికి రూ.5 లక్షలు బీమా అందించాలని నిర్ణయించడం అభినందనీయం. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆ కుటుంబాలకు బీమా వర్తింపజేయాలనే ఆలోచన ముఖ్యమంత్రికి రావడం గొప్ప విషయం. ఇలాంటి నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. కేసీఆర్ బీమాతో కలిగే ప్రయోజనాలు ప్రజలు భవిష్యత్లో చూడబోతున్నారు. కేసీఆర్ అంటేనే రాష్ర్టానికి కొండంత అండ. పేదల ఇళ్లలో కాంతిని తీసుకురాబోయే ఈ బీమాతో ప్రతి కుటుంబానికి ధీమా.
రాష్ట్రంలోని పేదోళ్ల బాధలు తెలిసిన నాయకుడు కేసీఆర్.. అందుకే వంటగ్యాస్ ధరలను రూ.400లకే ఇస్తానన్నడు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి పేదోళ్ల ఉసురుపోసుకుంటున్నది. రూ.420 ఉన్న సిలిండర్ ధరను అమాంతం రూ.1200లకు పెంచి పేదల పొట్టలు కొట్టుతున్నది. రేట్లు దించాలని కోరినా పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తానని చల్లని మాట చెప్పాడు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ సార్ బంపర్ మెజార్టీతో గెలవాలి. ఆయనకు ఆడవాళ్లు అందరూ అండగా ఉంటారు.
మాది వ్యవసాయ కుటుంబం. నా భర్త నాగేశ్వరరావు అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మణించాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు అప్పులు చేసి మరీ రెండేళ్లపాటు వైద్యం చేయించాం. కానీ ఫలితం లేకపోయింది. ఆయన మరణించారు. కానీ వైద్యం చేసిన అప్పులు గుండెల మీద భారంగా ఉన్నాయి. మాకున్న ఇద్దరు కుమార్తెల్లో అప్పటికే ఒక కుమార్తెకు వివాహం చేశాం. మరో కుమారై దివ్యాంగురాలు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో నా భర్త అనారోగ్యంతో మరణించడంతో నాకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నా కష్టాలన్నీ తీర్చింది. నా భర్త పేరుమీద వ్యవసాయ భూమి ఉండడం, అప్పటికే రైతుబీమా పథకంలో పేరు నమోదై ఉండడంతో వ్యవసాయ అధికారులకు మమ్ములను సంప్రదించారు. మా వద్ద ఉన్న పత్రాలన్నీ తీసుకెళ్లారు. నా భర్తకు నామినీగా ఉన్న నా బ్యాంకు ఖాతాలో పది రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా పరిహారం జమ అయింది. ఇక నా కష్టాలు కడతేరినట్లేనని అనుకున్నా. ఆ మొత్తంలో నా భర్త వైద్యం కోసం చేసిన అప్పులన్నీ తీర్చేశాను. మిగిలిన మొత్తాన్ని నా చిన్న కుమార్తె పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. రైతుబీమాతో నా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
నా భర్త చనిపోయి మూడేళ్లయింది. ఆయన పేరుతో పట్టా భూమి ఉండడంతో రైతుబీమా అమలవుతోంది. ఆయన చనిపోయిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రైతుబీమా కింద రూ.ఐదు లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ నగదుతో నా కుమార్తె వివాహం చేశా. అప్పులు పూర్తిగా తీర్చేశా. నా కొడుకును చదివించుకుంటున్నా. రైతుబీమా పరిహారమే రాకపోయి ఉంటే.. నా కుమార్తె వివాహం చేయగలిగేదాన్ని కాదు. అప్పులు కూడా అలాగే ఉండేవి. రైతుబీమా పథకం నా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుంది.
మరోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామంటూ సీఎం కేసీఆర్ తమ మ్యానిఫెస్టోలో చెప్పారు. ఇది ఎంతో సంతోషకరం. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రూ.400కే సిలిండర్ వస్తుంది. దీంతో మా లాంటి పేదలకు పెద్ద భారం తప్పుతుంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఇంకా అనేక మంచి మంచి హామీలున్నాయి. ఇప్పటికే అనేక సంక్షమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలను తెస్తుంది.