ఇల్లెందు, ఆగస్టు 23 : పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జడ్జి వసంత్ పాటిల్ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇల్లెందు కోర్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గత ఐదు నెలలుగా నిర్మాణంలో ఉన్న మరమ్మతు పనులను పర్యవేక్షించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. అంతకుముందు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి జిల్లా కోర్టు జడ్జికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఇల్లెందు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇల్లెందు కోర్టులో న్యాయవాదులు, కక్షిదారుల కోసం శౌచాలాయాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఉమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్ న్యాయవాదులు పెద్దూరు నరసయ్య, దంతాల ఆనంద్, ఎస్.వి.నరసయ్య, పి.గోపీనాథ్, కె.నారాయణ, పి.బాలకృష్ణ, ఎస్.వెంకటేశ్వర్లు, బి.రవికుమార్ నాయక్, ఎస్.సత్యనారాయణ దొర, ఎస్.బన్సీలాల్, ఏఓ జె.కిరణ్ కుమార్, జిల్లా కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Yellandu : పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి : జడ్జి వసంత్ పాటిల్