పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 25 : మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. సెలవురోజు కావడంతో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లలకు అన్నప్రాసన, తలనీలాల కార్యక్రమాలు జరుపుకున్నారు.
భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ అధికారులు భక్తులకు కావల్సిన ఏర్పాట్లను సమకూర్చారు. ఆలయ కమిటీ చైర్మన్ మహీపతి రామలింగం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై హైదరాబాద్కు చెందిన నాగమణి ‘శివలీలలు’ హరకధా కాలక్షేపం నిర్వహించారు.