కూసుమంచి, జనవరి 9: పాలేరు ప్రజలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆకాంక్షించారు. వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని, వారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తన జన్మదిన వేడుకల్లో అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పాలేరు నియోజకవర్గం ప్రజల సంతోషం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతు సహాయాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా తనకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరితోనూ కరచాలనం చేసి థ్యాంక్స్ చెప్పారు. అనంతరం శాంతి కపోతాన్ని ఎగురవేశారు.
ప్రత్యేక పూజలు..
తన పుట్టిన రోజు సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సోమవారం కూసుమంచి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం హనుమంతుడిని దర్శించుకున్నారు. కూసుమంచి హైస్కూల్ దగ్గర నుంచి ఓపెన్ టాప్ జీప్లో ఎమ్మెల్యే కందాళ, ఆయన సతీమణి విజయమ్మ, మనవళ్లు ప్రద్యూమ్, దక్ష్, హనికాలతో కలిసి అభివాదం చేస్తూ ఊరేగింపుగా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, భజన, డీజే ఆటపాటలతో ఊరేగింపుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
రక్తదాన శిబిరం..
పాలేరు ఎమ్మెల్యే కందాళ జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధి బాధితుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సతీమణి విజయమ్మ ప్రారంభించారు. సుమారు 60 మంది రక్తదానం చేశారు. కూసుమంచిలోని రెండు కళాశాలల విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలు చేశారు. కోలాటాలు, బాణాసంచాతో సందడి చేశారు. ఎమ్మెల్యే కందాళపై నల్లగొండ గద్దర్ ఆలపించిన గీతాలను విడుదల చేశారు.
కందాళ సేవా కార్యక్రమాలపై వీడియోను చిత్రీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖులు ఎస్.మనోహర్రెడ్డి, ఎస్.ఉపేందర్రెడ్డి, మహేందర్రెడ్డి, యుగందర్రెడ్డితోపాటు జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, ఏఎంసీ చైర్మన్లు మల్లీడి అరుణ, నంబూరి శాంతం, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాస్, నాలుగు మండలాల ఎంపీపీలు బాణోత్ శ్రీనివాస్, బెల్లం ఉమ, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, జడ్పీటీసీలు ఇంటూరి బేబీ, యండపల్లి వరప్రసాద్, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, పీఏసీఎస్ అధ్యక్షుడు వాసంశెట్టి వెంకటేశ్వర్లు, నాలుగు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఏసీపీ బస్వారెడ్డి, సీఐ కంది జితేందర్రెడ్డి, ఎస్ఐ రమేశ్ మూడు మండలాల ఎస్ఐలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.