తనను పార్లమెంట్కు పంపిస్తే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ నిజాయితీ పాలనకు, ఆరు నెలల కాంగ్రెస్ అబద్ధపు పాలనకు మధ్య జరుగుతున్నవన్నారు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసినోళ్లకు.. తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. రేవంత్రెడ్డి పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని ఆవేద న వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలను నమ్మొద్దని సూ చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీజేపీ దుర్మార్గమైనదని, వారికి ఎవరూ ఓటు వేయవద్దని సూచించారు. కేంద్రం లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దళితుల మూతికి ముంత కట్టే రోజులొస్తాయన్నారు. మల్లు రవి రెండుసార్లు ఎంపీగా గెలిచి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన పోవాలంటే బీఆర్ఎస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.