కూసుమంచి, జూన్ 21 : పాలేరులో రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు చెందిన 560 మంది ఎన్సీసీ క్యాడెట్లకు పది రోజులపాటు నిర్వహించే 11(టీ)బీఎన్ సీఏసీటీ-IV ఎన్సీసీ నైపుణ్య శిక్షణ శుక్రవారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా క్యాడెట్లకు ఫైరింగ్, వ్యక్తిత్వ వికాసం, డ్రిల్, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ నెల 28 వరకు జరిగే శిక్షణలో ఎన్సీసీ ప్రాధాన్యతల గురించి వివరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కల్నల్ సచిన్ నింబాల్కర్, వీఆర్సీ, జీపీ సీడీఆర్ ఏసీసీ వరంగల్, ఏడీ సికింద్రాబాద్ కల్నల్ సంజయ్ గుప్తా, కల్నల్ సంజీవద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.