వేంసూరు: మండలపరిధిలోని లింగపాలెం గ్రామంలోని శ్రీ హరిహర ఆలయానికి సోమవారం భక్తులు విరాళాలు అందించారు. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందిన గొర్లమారి శ్రీకాంత్ రెడ్డి, హేమసంధ్య దంపతులు లక్షరూపాయల విరాళాన్ని ఆలయకమిటీకి అందించారు. ఆలయకమిటీ సభ్యులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు.