కూసుమంచి, ఫిబ్రవరి 5: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల సందర్భంగా ఆదివారం ఆలయంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 1 నుంచి జరుగుతున్న బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చైర్మన్ బొడ్డు నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్వామివారికి డీసీసీబీ డైరెక్టర్, జడ్పీటీసీ ఇంటూరి శేఖర్-బేబీ పట్టు వస్ర్తాలను సమర్పించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను చెరువు సందీప్ అందజేశారు. సర్పంచ్ కొండా సత్యం, ఎంపీటీసీ అంబాల ఉమ, ఈవో నారాయణాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, ఫిబ్రవరి 5: నేలకొండపల్లి మేజరు గ్రామ పంచాయతీలోని పలు వార్డుల్లో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పనులకు సంబంధించి ప్రతిపాదనలు వేయాలని సూచించారు. ఇటీవల సీఎం కేసీఆర్ నేలకొండపల్లికి రూ.పది కోట్లు ప్రకటించడంతో ఆ నిధులతో పట్టణంలో అవసరమైన అన్ని పనులు పూర్తి చేసుకోవాలన్నారు.
నేలకొండపల్లిలో నిర్మించనున్న పెద్దమగుడి నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శాంత, సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, పీఆర్ ఈఈ శివగణేశ్, పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెన్నబోయిన శ్రీను, వంగవేటి నాగేశ్వరరావు, యండీ వాజిద్, గొలుసు రవి, కొండా కనకప్రసాద్, బాజా నాగేశ్వరరావు, రాయపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, ఫిబ్రవరి 5: నేలకొండపల్లి పట్టణంలో పలు సమస్యలను తెలుసుకునేందుకు ఆదివారం ఉదయం వచ్చిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ప్రధాన సెంటర్లో కొద్దిసేపు సందడి చేశారు. అక్కడ ఉన్న చాయ్ దుకాణం వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కందాళ సాధారణ వ్యక్తిలా టీ తాగుతూ దుకాణం యజమానితో మాట్లాడారు.
కూసుమంచి రూరల్, ఫిబ్రవరి 5: మండలంలోని కోక్యాతండా పంచాయతీ శివగాయత్రి ఆశ్రమంలో శివస్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. డీసీసీబీ డైరక్టర్ ఇంటూరి శేఖర్రావు, బీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు వేముల వీరయ్య, కార్యదర్శి మహ్మద్ ఆసిఫ్పాషా, సర్పంచ్లు మందడి పద్మ, బానోత్ కిషన్, నాయకులు వాకా సుధారాణి, కొక్కిరేణి సీతారాములు పాల్గొన్నారు.