రఘునాథపాలెం, నవంబర్ 24: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశం మందిరంలో కలెక్టర్తో కలిసి జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపు విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటరు జాబితా నుంచి తొలగించాల్సి వస్తే సంబంధిత ఇంట్లో ఒకరితో ఫామ్-7పై సంతకం తీసుకున్న తరువాతే తొలగించాలన్నారు. నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్లపై సమీక్ష చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిని నూతన ఓటరుగా నమోదు చేయడంలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఫ్రీ రివిజన్ యాక్టివిటీ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 1416 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 23కేంద్రాలకు ప్రతిపాదనలు చేసినట్లు, 43 కేంద్రాలకు లొకేషన్ మార్పునకు ప్రతిపాదించినట్లు తెలిపారు. మొత్తం 1439పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులపై రూపొందించిన పోస్టర్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 24: నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…అర్హూలైన వారందరూ ఓటరుగా నమోదవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి నుంచి ముందస్తు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అనంతరం ఓటు నమోదు చేసుకోవడం ఎలా అనే బ్రోచర్ను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి, ఎస్టీసీ దశరథం, తహసీలార్లు సుమ, శైలజ పాల్గొన్నారు.