కాసిపేట, ఏప్రిల్ 27 : తమతో కలిసి పదో చదువుకున్న స్నేహితుడు అకాల మరణం చెందడంతో భాదలో మునిగిపోయిన కుటంబానికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. తమ వంతుగా ఆర్దిక సాయంతో తమ మంచి మనసు చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన కళాకారుడు రాంటింకి రాజు తిరుపతి ఇటీవల మృతి చెందాడు. దాంతో, అతడితో కలిసి పదో తరగతి చదివిన స్నేహితులు తమ వంతుగా ఆర్థికంగా రాజు తిరుపతి కుటుంబానికి సాయమందించారు.
కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం రాజు తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. తమ వంతు ఆర్ధిక సాయంగా రూ.25000 వారికి అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాసరి శంకర్, బిజ్జరి శ్రీనివాస్, చొప్పదండి తిరుపతి, నాగపూరి శ్రీనివాస్, మార్క తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.