ఖమ్మం : కళాశాల స్ధాయిలోనే సామాజిక సేవ, వ్యక్తిగత నైపుణ్యం,జాతీయతాభావాలు కలిగి దేశాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ నారాయణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నగరంలోని డీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించారు. ఈనాటి యువతరమే రేపటి సమాజమని, విద్యార్థి దశలో యువతీ, యువకులు ఎన్ఎస్ఎస్లో వాలంటీర్లుగా సభ్యత్వం పోందాలన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మోహన్రెడ్డి, చైర్పర్సన్ శోభారెడ్డి, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, విజయ్కుమార్, వెంకటకృష్ణ తదితరులు పాల్గోన్నారు.