ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 23: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) రుణాలను ఎంఎస్ఎంఈ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆయా రంగాల వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు అందించనున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ సౌత్ రీజియన్ రీజినల్ మేనేజర్ టీవీవీఎస్ శర్మ తెలిపారు. ఇందుకోసం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లోనూ ఆధ్వర్యంలో వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు బుధవారం ఖమ్మంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఖాతాదారుల మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం శర్మ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ రుణాలు అందించేందుకు ఈ నెల 2 నుంచి రాష్ట్రంలోని అన్ని బ్రాంచీల్లో ఈ నెల 2 నుంచి ఖాతాదారుల మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఖమ్మం మీట్ అండ్ గ్రేట్కు కూడా జిల్లా వ్యాప్తంగా హాజరైన ఖాతాదారులు వ్యక్తం చేసిన పలు సందేహాలను ఆర్ఎం నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లాలోని అన్ని బ్రాంచీలు మేనేజర్లు పాల్గొన్నారు.