అశ్వారావుపేట, నవంబర్ 13: అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు ఎంపీ నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దమ్మపేట మల్లారం రోడ్డులో సోమవారం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. “ఈ సభకు వేల సంఖ్యలో వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే.. మెచ్చా విజయం ఖాయమని అనిపిస్తున్నది. భారీ మెజారిటీ ఇవ్వాలి” అని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత నియోజవర్గం ఎలా ఉందో పోల్చి చూడాలని, ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరిగిందో పరిశీలించాలని, ఏమేమి సంక్షేమ ఫలాలు అందాయో గుర్తుకు తెచ్చుకోవాలని, ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. సౌమ్యుడు, నిబద్ధతగల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావును మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేదిక పైకి సీఎం కేసీఆర్ రావడంతోనే ఆనందంతో కేరింతలు కొట్టారు. ‘జై కేసీఆర్’, ‘జైజై తెలంగాణ’ అని నినదించారు. ముందుగా, తెలంగాణ పాటలతో ప్రజలను గాయని మధుప్రియ ఉర్రూతలూగించారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుతోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు స్టెప్పులు వేశారు. ఈ సభతో దమ్మపేట మండలం గులాబీమయమైంది. రోడ్లన్నీ బీఆర్ఎస్ క్యాడర్, ప్రజలతో కక్కిరిసాయి. సభ పూర్తయిన తర్వాత సుమారు రెండున్నర గంటలకు ట్రాఫిక్ క్లియర్ అయింది.
దమ్మపేట రూరల్, నవంబర్ 12: ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ములకపల్లి జడ్పీటీసీ సభ్యురాలు సున్నం నాగమణి ఆదివారం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావును తాటిసుబ్బనగూడెంలోని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు.
అశ్వారావుపేట రూరల్, నవంబర్ 13: దమ్మేపట సభకు మండలం నుంచి 46 వ్యాన్లు, 95 ఆటోలు, 350 ద్విచక్ర వాహనాల్లో 15వేల నుంచి 17వేల మంది వెళ్లినట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకత మల్లికార్జునరావు, వైఎస్ఆర్ టీపీ మండల అధ్యక్షుడు కొనకళ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు-నాయకులు చిన్నంశెట్టి వరలక్ష్మి, నిర్మల పుల్లారావు, మందపాటి రాజమోహన్రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, జుజ్జురి వెంకన్నబాబు, నల్లపు లీలాప్రసాద్, చిన్నంశెట్టి వెంకటనర్సింహం, బరగడ కృష్ణ, పుట్టా సత్యం, నారం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట టౌన్, నవంబర్ 13: దమ్మపేట సభకు పట్టణం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. వీరిలో ప్రజాప్రతినిధులు-నాయకులు డీకేఎం మహిపాల్, కోటగిరి సీతారామస్వామి, జల్లిపల్లి శ్రీరామూర్తి, జేకేవీ రమణారావు, మందపాటి రాజమోహన్రెడ్డి, యూఎస్ ప్రకాశరావు, కాసాని చంద్రమోహన్, సంకా ప్రసాద్, తాడేపల్లి రవి, మోటూరి మోహన్ తదితరులు ఉన్నారు.
అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 13: దమ్మపేటలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభకు మండలం నుంచి వాహనాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. వీరిలో పార్టీ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు, ఎంపీపీ సున్నం లలిత, జడ్పీటీసీ సభ్యురాలు భారత లాలమ్మ, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు తదితరులు ఉన్నారు.
చండ్రుగొండ, నవంబర్ 13: దమ్మపేట సభకు మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఆటోలు, వ్యానులు, బస్సులు, ద్విచక్ర వాహనలపై భారీగా తరలివెళ్లారు.
అశ్వారావుపేట రూరల్, నవంబర్ 13: దమ్మపేట సభావేదికపై గాయకులు మధుప్రియ, వంగపండు ప్రసాద్ తమ పాటలతో సందడి చేశారు. వారి పాటలకు సభికులు, బీఆర్ఎస్ నాయకులతోపాటు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా నృత్యాలు చేశారు. ఆదివాసీ గిరిజనుల కొమ్ము, డప్పు నృత్యం ఆకట్టుకుంది.