ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధి ప్రాయంనుంచే రోశయ్య రాజకీయరంగంలోకి ప్రవేశించి, అత్యున్నత పదవులను అలంకరించారని అన్నారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సుపరిపాలనా దక్షుడిగా అందరి మన్ననలు పొందాన్నారని ఎంపీ నామ గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.