ముదిగొండ, ఏప్రిల్ 13 : అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో ఒక్క తడికి నీరివ్వకపోవడంతో జిల్లాలో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని, గత కేసీఆర్ పాలనలో ఏనాడూ పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే మీ తరఫున ఢిల్లీలో పోరాడుతానని, రెండుసార్లు ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడానని ఆయన గుర్తు చేశారు.
శనివారం ముదిగొండలో జరిగిన మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేసినా.. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏదో చేస్తుందని గెలిపించిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. అబద్ధపు ప్రచారాలు, అలవి కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేని పాలన చేస్తోందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసిందో ప్రజలకు తెలుసని, అయితే వంద రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్లకు అర్థమవుతుందన్నారు. అన్ని వర్గాల్లో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వచ్చిందని, దానిని సరిగా వినియోగించుకుంటూ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. హైవే కోసం భూములు కోల్పోయిన రైతులకు తక్కువ పరిహారం ఇస్తే తానే కేంద్ర ప్రభుత్వంపై పోరాడి ఎక్కువ పరిహారం వచ్చేలా చేశానన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే.. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా కరువే కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ముందు చూపుతో నీటి ఎద్దడి లేకుండా బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను సముద్రం పాలు చేసిందన్నారు. కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ కరువు ఉంటుందని, బెంగుళూరులో హోటళ్ల్లలో సాంబారు చేయొద్దని జీవో ఇచ్చారని, ఆ పరిస్థితి హైదరాబాద్లో కూడా అతి త్వరలోనే వస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఇవన్నీ గ్రహించి ప్రజలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
-రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
ఎంపీ నామా నాగేశ్వరరావు జీవితం తెరిచిన పుస్తకమని, జిల్లాలో ఆయన గురించి తెలియని వారు లేరన్నారు. కొన్ని కారణాల వల్ల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారిందని, మారిన ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉన్నదని, కొద్దిగా కష్టపడితే ఈ ఎన్నికల్లో ఎంపీగా నామా గెలుపు ఖాయమని అన్నారు. బీసీ అయిన డీసీసీబీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణాన్ని పదవిలో నుంచి దించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. మీ వెంట ఉన్న నాయకుల మాదిరిగా ఆయన వందల కోట్లు దోచుకోలేదని, కేవలం బీసీ అనే ఆయన్ను పదవీచ్యుతున్ని చేశారన్నారు.
-బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు
పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేస్తే ఎంపీగా నామా నాగేశ్వరరావుకు గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేశామా.. అని ప్రజలు బాధపడుతున్నారని, ఆ వ్యతిరేకతను మనకు అనుకూలంగా మలుచుకోవాలన్నారు. గత కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు వచ్చాయని, కానీ.. కాంగ్రెసోళ్లు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఎన్నికల కోడ్ అంటూ సాకులు చెబుతున్నారన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు ఇంకా నెల రోజులే గడువు ఉన్నా ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని, దీంతోనే నామా గెలుపు ఖాయమైందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నాయకులు బత్తుల వీరారెడ్డి, మీగడ శ్రీనివాస్ యాదవ్, పోట్ల ప్రసాద్, తోట ధర్మారావు, పచ్చ సీతారామయ్య, బంక మల్లయ్య, కోటి అనంతరాములు, మందరపు ఎర్ర వెంకన్న, కోడె బాబు, పంది శ్రీను, భిక్షం, ఖాజా, కొమ్మూరి స్వాతి, నాగయ్య, శంకర్, రమేశ్, సత్యనారాయణరెడ్డి, సిల్వరాజు, అమడాల జక్కర్ తదితరులు పాల్గొన్నారు.
-జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్