భద్రాచలం, ఫిబ్రవరి 25: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి కలిశారు. వారిద్దరూ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల అధ్యక్షుడు అరికెల్ల తిరుపతిరావు, రమణారెడ్డి, నాయకులు రమేశ్గౌడ్, కొండముక్కల సాయిబాబా, ఆకోజు సునీల్ కుమార్, గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు