సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 31 : అక్రమ కేసుల్లో అరెస్టు అయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి మచ్చలేని మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు చేసి ఇలా రాజకీయ వేధింపులకు గురిచేయడం బాధాకరమన్నారు. మంగళవారం సాయంత్రం హైకోర్టు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఆయురారోగ్యాలతో నారా చంద్రబాబు ఉండాలని, చెడుపై అంతిమంగా మంచి విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
కల్లూరు, అక్టోబర్ 31 : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు బెయిల్పై విడుదలైన శుభసందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన అనుచరులతో కల్లూరు పట్టణంలో పటాకులుకాల్చుతూ, మిఠాయిలు తినిపించి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు కోర్టు ద్వారా బెయిల్ మంజూరు కావడం శుభపరిణామమని, ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని, అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, లక్కినేని రఘు, పెద్దబోయిన శ్రీనివాసరావు, కీసరి వెంకటేశ్వరరెడ్డి, పెడకంటి రామకృష్ణ, వెంకటయ్య, మేకల కృష్ణ, బొప్పన రామారావు, ఇస్మాయిల్, కొరకొప్పు ప్రసాద్, దార్ల నర్సింహారావు, పాలడుగు శంకర్రావు, సరాబు వెంకటేశ్వరరావు, సీహెచ్.కిరణ్ పాల్గొన్నారు.
పెనుబల్లి, అక్టోబర్ 31 : చంద్రబాబునాయుడు బెయిల్పై విడుదల కావడం పట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని వీఎం బంజర రింగ్సెంటర్లో బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, కార్యదర్శి భూక్యా ప్రసాద్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, లగడపాటి శ్రీనివాసరావు, కొప్పుల గోవిందరావు, కొత్తగుండ్ల అప్పారావు, తేజావత్ తావునాయక్, తేళ్లూరి నాగేశ్వరరావు, గౌస్, కుమారి, మల్లెల సతీశ్, వెంకట్రావు, వెంకటేశ్వరరావు, తాళ్లూరి సురేశ్, రమణ, తాళ్లూరి శేఖర్రావు, మరకాల చంటి పాల్గొన్నారు.