సత్తుపల్లి రూరల్, మార్చి 12: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చెందిన 164 మందికి మంజూరైన రూ.88 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, సత్తుపల్లి పట్టణ, మండలంలోని 34 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక మాధురి ఫంక్షన్ హాల్లో ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలే ఆశీర్వదించాలని, పథకాలకు ప్రచార వారథులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్నికల వేళ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు. అందుకే అనేక ఆటంకాలు కల్పిస్తోందని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కవిత ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. అయినా మొక్కవోని దీక్షతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మనమంతా బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సూర్యనారాయణ, శ్రీనివాస్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, చాంద్పాషా, వల్లభనేని పవన్, వనమా వాసు, షేక్ రఫీ, అంకమరాజు, అద్దంకి అనిల్, అమరవరపు కృష్ణారావు, కట్టా అజయ్కుమార్, గొర్ల సంజీవరెడ్డి, కనగాల వెంకట్రావు, మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.