పెనుబల్లి, అక్టోబర్11: నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ముత్తగూడెం, కె.ఎం.బంజర, ఎల్.ఎస్.బంజర, సూరయ్య బంజర తండా, గణేశునిపాడు, పాత అగ్రహారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలంతో మాట్లాడారు. చిన్న గ్రామంలోనూ రూ.కోట్లు అభివృద్ధికి వెచ్చించామన్నారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సహకరిస్తున్నారని, ఆయనకు ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎల్.ఎస్.బంజరలో నిర్మించిన వారధికి బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య ‘సండ్ర వారధి’గా నామకరణం చేసి ఎమ్మెల్యేను సన్మానించారు. పర్యటనలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ లక్కినేని అల్యే, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, పార్టీ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, నాయకులు వెంకటసత్యనారాయణ, శీలం నాగిరెడ్డి, లక్ష్మణరావు, నారగాజు, సత్యనారాయణ, రామారావు, గోవిందరావు, వినీల్, వెంకటేశ్వరరావు, చెన్నారావు, శ్రీను, రత్నకుమారి, అశోక్కుమార్, శేఖర్రావు, నాగేశ్వరరావు, మురళి, రాధాకృష్ణ, వెంకటరెడ్డి, నర్వోత్తమరెడ్డి, నరసింహారెడ్డి, కిరణ్రెడ్డి, సుబ్బారావు, వీరభద్రారెడ్డి, తావునాయక్, నాగేశ్వరరావు, నిరంజన్గౌడ్, శ్రీను, గోపి, అజిత్, కృష్ణ, వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.