సత్తుపల్లి/ మామిళ్లగూడెం, ఆగస్టు 15: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టాలని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం నేరుగా హైదరాబాద్ వెళ్లి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం స్వామివారి వారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.