పెనుబల్లి: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం వీణవంకలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో వీఎం.బంజరుకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తుంచుకుని గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముక్కర భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, టీఆర్ఎస్ యువజన ప్రధాన కార్యదర్శి వంగా నిరంజన్గౌడ్, వీఎం.బంజరు గ్రామశాఖ కార్యదర్శి గోదా శ్రీనివాస్, మరీదు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.