జూలూరుపాడు, జనవరి 25: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ విమర్శించారు. రాష్టం నుంచి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు తీసుకుంటున్న కేంద్రం.. రాష్ట్ర అభివృద్ధి నయా పైసా నిధులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. రాష్ర్టంపై కేంద్రం చూపిస్తున్న చవితితల్లి ప్రేమను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. మండలంలోని ఆర్యవైశ్యకల్యాణ మండపంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 45 మందికి మంజూరైన రూ.45,05,220 విలువైన కల్యాణలక్ష్మి్మ, షాదీముబారక్ చెక్కులను, ఏడుగురు లబ్ధిదారులకు మంజూరైన రూ.2,36,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించి అబాసుపాలయిందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ అతికొద్ది కాలంలో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కేఆసీర్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో కేసీఆర్ చక్రం తిప్పి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు లూథర్ విల్సన్, వెంకటేశ్వరరావు, లావుడ్యా సోని, లేళ్ల వెంకటరెడ్డి, గలిగె సావిత్రి, శాం తిరాం, రాములు, శాంతిలాల్, కిషన్లాల్, పద్మ, కైక, దుద్దుకూరి మధుసూదన్రావు, యదళ్లపల్లి వీరభద్రం, లతీఫ్, వేల్పుల నర్సింహారావు, పొన్నెకంటి సతీశ్కుమార్, నున్నా రంగారావు, రోకటి సురేశ్, రామిశెట్టి రాంబాబు, దేవరకొండ కిరణ్, తోట శ్రీను, మోదుగు రామకృష్ణ, రామిశెట్టి నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.