సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 16: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, దయానంద్ దంపతులు శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.