కొణిజర్ల, జనవరి 8 : ప్రతిఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో నడుచుకోవాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఆదివారం కొణిజర్లలోని యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో నతానియులు జ్ఞాపకార్థం పాస్టర్లు దానిపాల్, వినయ్పాల్ సమక్షంలో నిరుపేద మహిళలకు ఎమ్మెల్యే చీరలను పంపిణీ చేసి మాట్లాడారు.
మనందరం ప్రేమ, అభిమానం, సహనం, ఓర్పు అలవర్చుకోవాలని, వారి బోధనలు మన జీవితాలను మార్చి సక్రమార్గంలో నడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బాధ్యులు వై.చిరంజీవి, కోసూరి శ్రీనివాసరావు, సూరంపల్లి రామారావు, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, నాయకులు పోట్ల శ్రీనివాసరావు, పోగుల శ్రీను, బడావథ్ సైదులు, మీసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.