కొత్తగూడెం అర్బన్, మార్చి 6: కొత్తగూడెం మున్సిపాలిటీ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని 135 మంది కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం కొత్తగూడెంలో పంపిణీ చేశారు.
మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, ఎంపీపీలు బదావత్ శాంతి, భూక్యా సోనా, తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ తదితరులు పాల్గొన్నారు.