నేలకొండపల్లి, ఆగస్టు 28: పాలేరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ముటాపురం గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మండ్రాజుపల్లి నుంచి మండ్రాజుపల్లి తండావరకు రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే కందాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, సర్పంచులు బానోత్ రాంబాయి, నెల్లూరి అనురాధ, ఎంపీటీసీ జర్పుల బాలాజీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి, శాఖమూరి సతీశ్, గండు సతీశ్, యెన్నెబోయిన శ్రీను, ఏపూరి రామారావు, బెల్లం పుల్లయ్య, వజ్జా శ్రీనివాసరావు, అనగాని నరసింహారావు, కోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.