నేలకొండపల్లి, డిసెంబర్ 4: మండలంలోని రాజేశ్వరపురం సొసైటీ కార్యాలయ నూతన భవనం నిర్మాణానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. భవనం కోసం రూ.20 లక్షలు మంజూరు కావడంతో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్ దండా పుల్లయ్య, ఎంపీటీసీ చంద్రమ్మ, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మార్కెట్ చైర్మన్ నంబూరి శాంత, పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, సొసైటీ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి, డీసీవో విజయకుమారి, కోటి సైదారెడ్డి, డైరెక్టర్లు వీరవెల్లి నాగరాజు, దండా రంగయ్య, సీఈవో వీరబాబు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
గ్రంథాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
మండలంలోని మండ్రాజుపల్లిలో తాటికొండ సీతారామయ్య జ్ఞాపకార్థం నిర్మించనున్న గ్రంథాలయానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామస్తులు, యువత కోసం గ్రంథాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు.