టేకులపల్లి, అక్టోబర్ 24 : విజయదశమి పండగను పురస్కరించుకొని మండల కేంద్రం రామాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన ప్రచార వాహనానికి ప్రజలు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచార రథానికి ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామాలయం నుంచి దాస్తండా వరకు ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాస్తండాలో గ్రామ దేవతలకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టేకులపల్లి యూపీఎస్ పాఠశాల ప్రక్కన ఉన్న ఇస్త్రీ షాపులో దుస్తులు ఇస్త్రీ చేసి ఓటు అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో దాస్తండాలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అన్నివర్గాలకు న్యాయం జరిగేలా ఉందని, ప్రజలందరూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
అనంతరం దాస్తండా పంచాయతీ పరిధిలోని సింగ్యాతండా, లచ్చతండా, రేగులతండా, మంగళతండాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శి బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, బోడ బాలునాయక్, ముఖ్యనాయకులు బానోత్ రామానాయక్, బానోత్ కిషన్నాయక్, చీమల సత్యనారాయణ, బానోత్ ప్రియాంక, దరావత్ బాలాజీనాయక్, బానోత్ పూల్సింగ్నాయక్, దళపతి శ్రీనివాస్, బానోత్ రవికుమార్, భూక్యా బాలకృష్ణ, జాలది అప్పారావు, మాలోత్ పూల్సింగ్నాయక్, చింత వెంకన్న, ఉండేటి బసవయ్య, కుమ్మరి కిరణ్, భూక్య రాజా, బర్మావత్ శివకృష్ణ, జాటోత్ నరేశ్, మాలోత్ సురేందర్, పూన్నెం రాంబాబు పాల్గొన్నారు.