శ్రీరాంపూర్, మార్చి 16: సింగరేణి స్థ లంలో నివాసముంటున్న వారికి పట్టా లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజ లు అండగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నా రు. నస్పూర్ మున్సిపాలిటీలోని 5,6, 7, 9 వార్డుల పరిధిలో ఉంటున్న 185 కుటుంబాలకు గురువారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికులు, కార్మికేతర కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నా రని పేర్కొన్నారు. బెల్లంపల్లి, మందమ ర్రి, క్యాతన్పల్లి, శ్రీరాంపూర్, నస్పూర్లలో సింగరేణి యాజమాన్యం నివా స స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంటుకు అప్పగించిందని చెప్పారు.
శ్రీరాంపూర్ డివిజన్లో 186 ఎకరాల్లో ప్రజలకు ప ట్టాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నస్పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని సుందరయ్యనగ ర్, వాటర్ ట్యాంక్ ఏరియా, అరుణక్కనగర్, ఝాన్సీనగర్, ఆర్కే 6 గుడిసెల్లో 3000 మంది కార్మికులు, కార్మికేతర కుటుంబాలకు ఇండ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. కౌన్సిలర్లు బండి పద్మ, పూదరి కుమార్, బౌతు లక్ష్మి, బెడిక లక్ష్మి, నాజర్, వంగ తిరుపతి, హైమ ద్, జనార్దన్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, నాయకులు కమలాకర్రావు, రాజేంద్రపాణి, రఫీఖ్ఖాన్, ప్రవీణ్, విక్రం, మధు, బండి తిరుపతి, రౌతు రజిత, భానుచందర్, కందుల ప్రశాంత్, బోనాసి స్వామి, పెర్క సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
సొంతింటి కల నెరవేరింది..
సింగరేణి సంస్థను నమ్ముకొని ఉపాధి పొందుతున్న తమకు కేసీఆర్ రూపంలో సొంతింటి కల నెరవేరుతుంది. 30 సంవత్సరాలుగా సింగరేణిలో పని చేస్తున్నా ఇప్పటి వరకు తమకు సొంత స్థలం లేదు. కాని సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్థలాన్ని మాకు పట్టా కల్పించారు. సంస్థలో పని చేస్తు పిల్లలను పెంచి పోషించుకుంటు ఇక్కడే ఉంటున్నాము. ఇంటి స్థలం కూడా లేదు. సంస్థలో ఇంత కాలం పని చేసి పిల్లల చదువులు, వారి పెల్లిలు, బాగోగులు చూసుకొనేసరికే సరిపోయింది. స్వంతం స్థలం లేదనే ఆవేదనతో ఉన్న మాకు కేసీఆర్ మీ స్థలం మీకే అని పట్టాలు కల్పించడం సంతోషంగా ఉంది. నివాస స్థలానికి పట్టా ఇస్తున్నారని, ఇక పక్కా ఇల్లు నిర్మించుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు.
– సామంతుల లక్ష్మి, శ్రీరాంపూర్ కాలనీ
పట్టా ఇవ్వడం ఆనందంగా ఉంది..
ఎన్నో ఏండ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప ట్టాలు కల్పించడం ఆనందం గా ఉంది. మేం 28 ఏళ్లుగా ఇ క్కడే ఉంటున్నాం. మా సొం తూరు ఇదే అని చెప్పుకునే లా అనుబంధం ఈ ప్రాంతంతో పెరిగింది. పట్టాలు క ల్పించిన సీఎం కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటం. ఎమ్మెల్యే దివార్రావు ప్రత్యేక చొరవ వల్లే ఈ పట్టాలు అందుతున్నయ్.
– పాదం లక్ష్మి, అరుణక్కనగర్
ఇబ్బందులన్నీ తొలగినయ్..
అరుణక్కనగర్లో నివాసం ఉంటున్న వారందరి స్థలాలకు పట్టాలు ఇచ్చారు. గ తంలో తాత్కాలికం గా నిర్మించుకున్న ఇం డ్లకు మరమ్మతులు చేసుకోవా లంటే సింగరేణి ఎస్అండ్ పీసీ విభాగం నుంచి వేధింపులు ఉండేవి. దీంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇక అవి ఉండవు. గత ప్రభుత్వాలు చేయలేని పని కేసీఆర్ చేశారు. కేసీఆర్ ఆన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తు న్నారనడానికి ఇదే నిదర్శనం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ది వాకర్రావు వల్లే మాకు ఈ పట్టాలు వస్తున్నయ్. గతంలో ఇచ్చిన హామీని వారు నిలబెటు కున్నరు.
– దాట్ల రామస్వామి, శ్రీరాంపూర్ కాలనీ