పాల్వంచ, ఫిబ్రవరి 7: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) వ్యవస్థాపక అధ్యక్షుడు సంగెం జంగయ్యగౌడ్ (85) ఆదివారం పాల్వంచ పట్టణం కాంట్రాక్టర్స్ కాలనీలోని స్వగృహంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం పట్టణానికి విచ్చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి జంగయ్య పార్థివ దేహానికి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జంగయ్య ఎనలేని కృషి చేశారన్నారు. జంగయ్య తనకు సమీప బంధువు అని తెలిపారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీబీజీకేఎస్ నాయకుడు ఊకంటి గోపాలరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు కిలారు నాగేశ్వరరావు, మహీపతి రామలింగం, రెడ్డిమళ్ల వెంకటేశ్వర్లు, నాగరాజు, చందూనాయక్, రామకృష్ణ, మల్లికార్జున్, కోటేశ్వరరావు, కటుకూరి రవి, రాజేందర్, రవీందర్రెడ్డి, శ్రీధర్, ధనయ్య ఉన్నారు.