భద్రాచలం, మార్చి 28: శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం భద్రాచలం రానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి 7:30 గంటలకు సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు.
రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 9:45 గంటలకు సారపాక నుంచి బయలుదేరి 10 గంటలకు స్వామివారి కల్యాణం జరిగే మిథిలా ప్రాంగణానికి చేరుకుని కల్యాణాన్ని వీక్షిస్తారు. మధ్యాహ్నం 12:15 గంటలకు మిథిలా ప్రాంగణం నుంచి బయలుదేరి 12:30 గంటలకు ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి 3 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.