ఖమ్మం, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ‘మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావు.. ఆయనకంటే ఊసరవెల్లే నయం.. సీఎం కేసీఆర్ దయతలిచి తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు.. లేకపోతే పదేళ్ల క్రితమే తుమ్మల రాజకీయ జీవితం ముగిసిపోయేది. తుమ్మల నాలుకకు నరం లేదు. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. పదవులు అవసరం లేదని ఆయన అనేకసార్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు అవే పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోదావరి జలాలను ఖమ్మం తీసుకవస్తానంటున్న తుమ్మల గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మేజర్, మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండి జలాలను ఎందుకు తీసుకురాలేదు. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల బీఆర్ఎస్కు చేసిన మేలు గుండు సున్నా అని సాక్షాత్తూ కేసీఆరే ప్రకటించారు. అది అక్షర సత్యం. తెలంగాణ ఉద్యమంలోనూ తుమ్మల పాత్ర లేదు. పైగా ఓ పార్టీలో కొనసాగుతూ ఉద్యమకారులను జైల్లో పెట్టించారు. ఎంతోమంది రాజకీయ నాయకులను తొక్కి తుమ్మలపైకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓడించి ప్రజలే ఆయన్ను దగ్గరుండి ఇంట్లో కూర్చోబెడతారు..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావని, ఆయనకంటే ఊసరవెల్లే నయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మలపై దయతలిచి సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, లేకపోతే పదేళ్ల క్రితమే తుమ్మల రాజకీయ జీవితం ముగిసిపోయేదన్నారు. అలాంటి తుమ్మల నేడు కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తుమ్మల నాగేశ్వరరావు నాలుకకు నరం లేదని, ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే బయటకు వస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే దగ్గరుండి ఆయన్ను ఇంట్లో కూర్చోబెడతారన్నారు. పాలేరు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిపిస్తే, ఇప్పుడు తుమ్మల పార్టీ తరఫున పోటీ చేసే ఎవరూ లేక తనతో పోటీచేయించారని అనడం సిగ్గుచేటన్నారు. అవసరానికి తగినట్లు పార్టీలు మారడం తుమ్మలకే చెల్లిందన్నారు. పదవుల కోసమే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తుమ్మలకు ఎప్పుడూ లేదన్నారు. పదవులు అవసరం లేదని అనేకసార్లు ప్రకటించిన తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో చెప్పాలన్నారు.
గోదావరి జలాలను ఖమ్మం తీసుకవస్తానంటున్న తుమ్మల గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మేజర్, మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు తుమ్మల చేసిన మేలు గుండు సున్నా అన్ని సీఎం కేసీఆరే పాలేరు సభలో ప్రకటించారని గుర్తుచేశారు. తుమ్మల, పొంగులేటి పార్టీ ద్రోహులన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తుమ్మల మిన్నకున్నారన్నారు. పైగా ఉద్యమకారులను జైల్లో పెట్టించారన్నారు. తన మంత్రి పదవి కోసం పాలేరు ఎమ్మెల్యే కందాళకు కేటీఆర్ డబ్బులు ఇచ్చారని తుమ్మల ఆరోపించడం, బాచుపల్లి మమత కాలేజీలో తనకు మంత్రి కేటీఆర్ భాగస్వాములనడం హాస్యాస్పదమన్నారు. నిజాయతీపరుడనని చెప్పుకునే తుమ్మలకు అశ్వారావుపేట ప్రాంతంలో అన్ని ఆయిల్పాం తోటలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎంత మంది రాజకీయ నాయకులను తొక్కి తుమ్మలపైకి వచ్చారన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. గతంలో డీసీసీబీని లూటీ చేసిన వ్యక్తిని పొంగులేటి, తుమ్మల పక్కన తిప్పుకుంటున్నారని, తాను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత డీసీసీబీని లాభాల బాటలోకి తెచ్చానన్నారు. బీసీనైనా తనకు డీసీసీబీ పదవి ఇస్తే ఎంతో మంది మంత్రి అజయ్ను ప్రశ్నించారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు.
తుమ్మల వ్యాఖ్యలు బాధాకరం..
నా గురించి, సీఎం కేసీఆర్ గురించి మాజీ మంత్రి తుమ్మల అసత్య వ్యాఖ్యలు చేయడం బాధాకరం. తుమ్మల వైఖరిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై ఒక్క అవినీతి మరక లేదు. నేను సంపాదించిన దానిలో కూడా కొంత ప్రజలకు ఇచ్చా. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో నైనా ఉండొచ్చు.. కానీ కష్టకాలంలో అన్ని విధాలా ఆదరించి, అకున చేర్చుకుని అందలం ఎకించిన కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటే తుమ్మల గౌరవం పెరిగేది. వాస్తవాలేమిటో తుమ్మల మనస్సాక్షికి తెలుసు. తెలంగాణ బిల్లుకు సంబంధించి ఓటింగ్ పెట్టినప్పుడు నేనే మొదటి ఓటు వేశాను. ప్రజల ఆశీర్వాదంతో నేను పార్లమెంట్లో అడుగు పెట్టాను. ప్రజలు గతంలో ఏ నాయకుడికి ఇవ్వని మెజార్టీ నాకు ఇచ్చారు.
– నామా నాగేశ్వరరావు, ఎంపీ
ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు గెలుచుకుంటాం..
తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి పాత్ర ఏమీ లేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర నిర్మాణంలోనూ వారి పాత్ర లేదు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ సముచిత స్థానం ఇచ్చారు. నాడు బీఆర్ఎస్లో ఉంటూ తుమ్మల, పొంగులేటి ఒకరికొకరు పొడుచుకుంటూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓటమిపాలు చేశారు. ఇప్పుడు వేరే పార్టీలో చేరి ఆ పార్టీని ఉద్ధరిస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు వారి బాధ బీఆర్ఎస్కు లేదు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది స్థానాలు సాధించుకుంటాం. కేసీఆర్ ఎప్పుడూ తుమ్మలను తకువ చేసి చూడలేదు. పాలేరు సీటు కోసం తుమ్మల అనేకసార్లు ప్రయత్నించారు. ఇప్పుడు పాలేరు సీటు వదిలేసి ఖమ్మం వలస వచ్చారు. ఆయనకు నిజంగా ప్రజల్లో విశ్వసనీయత ఉందని అనుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలి. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను చూసి ప్రజలు మరోసారి కేసీఆర్కి అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపించాయి. విజయంలో తుమ్మల పాత్ర ఎప్పుడూ లేదు.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించింది తుమ్మల, పొంగులేటినే..!
తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో కొనసాగుతూ పదవులు అనుభవించారు. ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్పై వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్కు గతంలో మంత్రి పదవి ఇప్పించినట్లు నిస్సిగ్గుగా చెప్పుకోవడం తుమ్మలకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వంలో తుమ్మలకు మంత్రి పదవి ఎలా వచ్చిందో జిల్లా ప్రజలకు తెలుసు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను దగ్గరుంచి ఓడించింది తుమ్మల, పొంగులేటినే. ఎన్నికల్లో తనను ఓడించింది పొంగులేటినే అని తుమ్మల నాడు చెప్పుకొన్నారు. ఇప్పుడు వారిద్దరే చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. డబ్బు రాజకీయాలకు వారు తెరతీశారు. కానీ ప్రజలు చైతన్యవంతులు. వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు.
– తాతా మధుసూదన్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
గత ఎన్నికల్లో నన్ను ఓడించారు..
గత అసెంబ్లీ ఎన్నికలో నేను వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. నేను పోటీ చేస్తున్న స్థానం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి మరోవ్యక్తిని బరిలోకి దింపారు. నా పరాజయానికి కారకుడయ్యారు. మాజీ తుమ్మలను ఓడగట్టడంలోనూ పొంగులేటి పాత్రే ఉంది. అనూహ్యంగా ఇద్దరూ ఇప్పుడు ఒక పార్టీలో కలవడం విచిత్రం. ధనబలంతో వీర్రవీగుతున్న తుమ్మల, పొంగలేటికి భవిష్యత్తులో ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారు.
– బానోతు మదన్లాల్, బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి
తుమ్మల విశ్వాస ఘాతకుడు
కేసీఆర్కు మంత్రి పదవి ఇప్పించానని మాజీ మంత్రి తుమ్మల ప్రచారం చేయడం హాస్యాస్పదం. పార్టీలో తాను తప్ప మరెవరూ ఎదగకూడదనేది తుమ్మల మనస్తత్వం. టీడీపీలో కొనసాగినప్పుడు నన్నూ అలాగే అణద్రొక్కారు. తుమ్మలపై ప్రజలకు విశ్వాసం లేదు. ఇంకొకరితో స్నేహంగా మెలగడం తుమ్మలకు నచ్చదు. సీఎం కేసీఆర్ సీటు ఇచ్చారో.. లేదో.. తుమ్మల ఆత్మసాక్షిగా చెప్పాలి. తుమ్మల మాట్లాడే వాటిలో నూటికి 99 అబద్ధాలు ఉంటాయి. ప్రజలు, కార్యకర్తలను మోసం చేయడంలో తుమ్మల దిట్ట. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధిష్ఠానాలను మచ్చిక చేసుకునే విషయంలో ముందుంటారు. మొత్తానికి ఆయన విశ్వాస ఘాతకుడు.
– కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
తుమ్మల, పొంగులేటిదీ మోసపూరిత చరిత్ర..
మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటిది మోసపూరిత చరిత్ర. బీఆర్ఎస్లో కొనసాగుతూ వారు పాల్పడిన చీకటి ఒప్పందాల వల్లే గత ఎన్నికల్లో నేను ఓడిపోయాను. పార్టీని వారు భ్రష్టు పట్టించారు.
– లింగాల కమల్రాజు,బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి
ఒక్క కాంట్రాక్ట్ చేసినట్లు నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా..
పాలేరు సభలో ముఖ్యమంత్రి కేసీఅర్ మాటలు అక్షర సత్యం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలి. అబద్ధాలు చెప్తూ మోసం చేయాలని చూడడం సరికాదు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క కాంట్రాక్ట్ తీసుకున్నట్లు నిరూపించినా నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా. నాపై అసత్య ఆరోపణలు సరికాదు.
– కందాళ ఉపేందర్రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే