ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 23: ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం నెలవంక కనిపించడంతో శుక్రవారం నుంచి వారు ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అజయ్కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉపవాస దీక్ష ఆచరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సాయంత్రం నమాజ్ ఆచరించుకోవడానికి వెసులుబాటు కల్పించిందని అన్నారు. రంజాన్ను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నామని అన్నారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మతులకు నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. పేదలకు దుస్తుల పంపిణీలతోపాటు ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అజయ్ వివరించారు.