ఖమ్మం : అనతి కాలంలోనే జిల్లా ప్రజల మన్ననలు పొందిన శ్రీబాలాజీ ఎస్టేట్స్ రియల్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శ్రీబాలాజీ ఎస్టేట్స్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఖమ్మం నగరంలో జరిగింది. దీనికి మంత్రి పువ్వాడ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మల్బరి, శ్రీగంధం చెట్ల పెంపకంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన సంస్థ ఎండీ వత్సవాయి రవిని మంత్రి అభినందించారు.
మొక్కల పెంపకంతో కూడిన రియల్ ఎస్టేట్స్ వ్యాపారం కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగస్వాములు అవుతున్నందుకు అభిందించారు. క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన మంత్రిని, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను సంస్థ ఎండీ వత్సవాయి రవి శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.