నమస్తే నెట్వర్క్ ;ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటారు. పలు చోట్ల రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేసి యువకులు రక్తదానం చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ప్రచార రథాలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. ‘హ్యాపీ బర్త్ డే కేటీఆర్.. జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మంలో ఎమ్మెల్సీ తాతా మధు, మణుగూరులో విప్ రేగా కాంతారావు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజా నాయకుడిగా కేటీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖలమంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రోగులకు పండ్లు అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేక్ కట్ చేశారు. మధిర పట్టణంలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బీఆర్ఎస్ నాయకులతో కలిసి భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు వేడుక నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. భద్రాద్రి జిల్లా మణుగూరు పట్టణంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గులాబీ రంగు, మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలతో స్వయంగా తయారు చేయించిన 2 వేల గొడుగులను పట్టణవాసులకు పంపిణీ చేశారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఉర్దూఘర్లో భద్రాద్రి జడ్పీ వైస్చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఇల్లెందులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మొక్కలు నాటారు. అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.