ఖమ్మం : ప్రతి ఒక్కరికి మానసిక, శారీరక ఉల్లాసం కలగడంతో పాటు వారిలో ఉన్న అంతర్గత ప్రతిభను వెలికి తీసేందుకు ఆటలు ఎంతో దోహదం చేస్తాయని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సర్థార్ పటేల్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన బహుమతి ప్రధానోత్సవ కార్యాక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు.
విద్యుత్ ఉద్యోగుల క్రీడల సమన్వయకర్త ఏడీఈ బాబు నాయక్ మాట్లాడుతూ మూడు రోజుల క్రీడా పోటీలను ఉద్యోగులు ఎంతో స్పోర్టీవ్గా తీసుకుని భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ఈ దీపక్ వాస్నిక్, సీఈ జి.పుల్లయ్య, జిల్లా క్రీడల అధికారి పరందామరెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు రమేష్, సురేందర్లు పాల్గొన్నారు