ఖమ్మం : ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ కూడలిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు బుధవారం పరిశీలించారు. ఈ కూడలి అభివృద్దికి స్థానికులు సహకరించాలని కోరారు. పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారులను, అధికారులను వారు ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు మార్చి రోడ్డు మీదలేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
డ్రైనేజి పనులను నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ ఏసీపీ, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.