రామవరం, ఏప్రిల్ 13: ఖమ్మం జిల్లాలో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగ(ఈస్టర్)ను పురస్కరించుకుని ఆయన అనుభవించిన శ్రమదినాలకు గుర్తుగా 40 రోజులపాటు క్రైస్తవులంతా ఉపవాసంలోను, దానధర్మంలోను పాల్గొన్నారు. యేసుక్రీస్తు జెరూసలెంలోకి ప్రవే శించిన రోజున మట్టలను అలంకరించి ఆయనకు స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలో మట్టల ఆదివారం నిర్వహించారు.
ఉదయం కార్మికుల ప్రాంతమైన రుద్రంపూర్ లోఈతమట్టలు చేతపట్టి హోసన్న గీతం పాడుతూ పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉపవాసదీక్షలు ఆఖరి వారానికి చేరుకోవడంతో ఈ వారం రోజులపాటు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అనిల్ కుమార్ బాబు, ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు, రత్నరాజు, ఛాప్లినాటి, లావణ్య , మేరీ కుప్పస్వామి, మందుల జయరాజు, మార్షల్, జేసీ సైమన్, ఆనంద్, మంద నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.