సత్తుపల్లిరూరల్, జనవరి 8 : మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ఇటీవల మృతి చెం దారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం కరీంనగర్లోని వారి స్వగృహానికి వెళ్లి మల్లయ్య చిత్రపటంవద్ద నివాళి అర్పించారు.
గంగుల కమలాకర్, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఇల్లెందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ, నాయకులు ఉన్నారు.