చండ్రుగొండ, ఏప్రిల్ 3: భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఘటన ములకలపల్లి మండలం మాదారంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన నమిత (26)కు కొన్నేళ్ల క్రితం పాల్వంచ పట్టణానికి చెందిన ఆరింపుల రాజేశ్తో వివాహమైంది. కొద్దిరోజులుగా రాజేశ్ భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యను నమ్మబలికి మాదారంలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. రక్తపుమడుగులో ఉన్న నమితను గ్రామస్తులు గుర్తించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందింది. ఘటనపై పాల్వంచ సీఐ నాగరాజు, ములకలపల్లి ఎస్సై సాయికిశోర్రెడ్డి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.