ఖమ్మం లీగల్, డిసెంబర్ 30 : లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకొని లాభం పొందాలని జిల్లా జడ్జి బీ.ఎస్. జగ్జీవన్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మంలో జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఇరుపక్షాల వారిని గెలిపించే వేదిక లోక్ అదాలత్ అని, ప్రతిఒక్కరూ సమయం విలువను గుర్తించి లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మంలోని ప్రముఖ వైద్యుడు, యూనియన్ బ్యాంకుపై దాఖలు చేసిన రెండు సివిల్ కేసుల్లో రాజీ చేసిన న్యాయమూర్తులు లోక్ అదాలత్ అవార్డు జారీ చేశారు. కార్యక్రమంలో న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జావేద్పాషా, న్యాయమూర్తి కె.ఆశారాణి, బ్యాంకు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ సభ్యుడిగా న్యాయవాది ఎ.విజయ్రాఘవ వ్యవహరించారు.
కేసుల పరిష్కారం
జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు, ముందస్తు (ప్రి లిటిగేషన్ కేసులు) ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఎస్.జగ్జీవన్కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి అబ్దుల్ జావేద్పాషా కేసుల పరిష్కారం కోసం బెంచ్లను ఏర్పాటు చేశారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి.. మోటరు వాహన ప్రమాద కేసులను విచారించి.. 91 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.1.77 కోట్ల పరిహారం ఇప్పించారు. అలాగే విద్యుత్ చౌర్యం కేసులను కూడా పరిష్కరించారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.ఆశారాణి సివిల్ కేసుల లోక్ అదాలత్ బెంచ్కి అధ్యక్షత వహించి.. బ్యాంకు, ఇతర సివిల్ తగాదాలను పరిష్కరించారు. క్రిమినల్, చెక్కులు, డ్రంకెన్ డ్రైవ్ కేసులను మెజిస్ట్రేట్లు పి.గోపిక, నాగశ్రావ్య, కె.దీప, వి.మాధవి, ఆర్.శాంతిలత పరిష్కరించారు. పెట్టీ కేసులను రెండవ శ్రేణి మెజిస్ట్రేట్ సలీంపాషా పరిష్కరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
-జిల్లా జడ్జి జగ్జీవన్కుమార్