ఖమ్మం, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 2 శాతం సీఎస్టీని సీఎం కేసీఆర్ రద్దు చేయడంపై ఖమ్మం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మా రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాధాలు తెలిపారు.
సీఎం నిర్ణయం ద్వారా రైస్ మిల్లర్లు ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులకు ఉన్న అడ్డంకులు తొలగాయని, అన్ని దేశాలకు వే బిల్లుల రవాణా పత్రాలతో బియ్యం రవాణా చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జవ్వాజి నగేశ్, సహాయ కార్యదర్శి బొమ్మా మధు కుమార్, ఈసీ సభ్యులు సత్యనారాయణ, బొమ్మా సత్యం, లవిరిశుట్టి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.