మామిళ్లగూడెం, డిసెంబర్ 17: పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఎంపికలో భాగంగా తొమ్మిదోరోజు శనివారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 980 మంది హాజరైనట్లు తెలిపారు. వారిలో 626 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు అర్హత సాధించినట్లు చెప్పారు.
తొమ్మిదో రోజు మొత్తం 1,192 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 980 మంది హాజరై ఈవెంట్లలో పాల్గొన్నట్లు వివరించారు. పరీక్షలకు హాజరువుతున్న అభ్యర్థులు.. ఉద్యోగాలు ఇపిస్తామనే వారి మాయమాటలు నమ్మరాదని, ఎవరైనా అలా చెబితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపికలన్నీ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్నాయని తెలిపారు.