ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్కు ఆదాయం రెట్టింపు అయ్యేలా రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కృషి చేయాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ ఈ మార్చితో ఆర్ధిక సంవత్సరం ముగుస్తుండడంతో రెవిన్యూ సిబ్బంది ఇంటి పన్నులు, పంపు పన్నుల వసూలు వందశాతం పన్నులు పూర్తి చేయాలని పిలుపినిచ్చారు.
ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలు అయ్యాయని, నూరు శాతం ఇంటి పన్నులు, పంపు పన్నులు వసూలుచేయాలని అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలని మేయర్ సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి, టౌన్ ప్లానింగ్ , రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.