ఖమ్మం : టీఎన్జీవోకు ఖమ్మం జిల్లాలో పూర్వ వైభవం తీసుకోస్తానని జిల్లా నూతన కన్వీనర్ అబ్జల్హాసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో కార్యాలయంలో నూతన కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎన్జీవో పంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పై ఉన్న నమ్మకంతో సెంట్రల్ యూనియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, సెక్రటరీ ప్రతాప్ ఆదేశాల మేరకు తనకు కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. వారు ఇచ్చిన అవకాశంతోపాటు అందరి సహకారంతో టీఎన్జీవో సంఘానికి పునర్వైభవాన్ని తీసుకొస్తానని తెలిపారు.
నిత్యం ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిషారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సెంట్రల్ కమిటీ నాయకులు కొమరగిరి దర్గాప్రసాద్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోడి లింగయ్య, మహిళా సంఘం నాయకురాలు శాబాసు జ్యోతి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు షేక్ మీరా, డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హకీం, నాయకులు ఆర్వీఎస్ సాగర్, నందగిరి శ్రీను, వేల్పుల విజేత, ట్రెసా అధ్యక్షుడు తుంబరు సునిల్ రెడ్డి, టీజీవో గౌరవాధ్యక్షులు ఖాజామియా, కూరపాటి రంగరాజు తదితరులు పాల్గొన్నారు.