ఖమ్మం, అక్టోబర్ 5: బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్తో దేశ ముఖచిత్రం మారుతుందని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన నాయకత్వంలో దేశం సస్యశ్యామలం అవుతుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లో ప్రకటించిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో సంబురాలు మిన్నంటాయి.
ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ సెంటర్కు పటాకులు పేల్చారు. మిఠాయిలు తినిపించుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, బీ(టీ)ఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు చంద్రావతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా, బీ(టీ)ఆర్ఎస్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ తదితరులు నృత్యం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్ పట్టువిడువకుండా పోరాడి ఎలాగైతే తెలంగాణను సాధించారో బీఆర్ఎస్తోనూ అదే విధంగా దేశ రాజకీయాలను మారుస్తారని అన్నారు. అలా మార్చే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలు ఏమిటో, వారికి ఎలాంటి సంక్షేమం అందించాలో కేసీఆర్కు తెలుసునని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలు చేయడానికే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రపోషించలేని స్థితిలో ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల క్షేమం కోసం జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని దేశంలోని అనేక మంది నాయకులు ఆయనకు ఆహ్వానం పలికారని గుర్తుచేశారు.
బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు చింతనిప్పు కృష్ణచైతన్య, తాజుద్దీన్, షేక్ ముక్తార్, మాధవరావు, మేకల సుగుణారావు, కన్నం ప్రసన్నకృష్ణ, మడూరి ప్రసాద్, హెచ్ ప్రసాద్, పాలడుగు పాపారావు, షౌకత్అలీ, పొన్నం వెంకటేశ్వర్లు, పులిపాటి ప్రసాద్, బుర్రి వినయ్కుమార్, కొల్లు పద్మ, తన్నీరు శోభారాణి, షేక్ షకీనా, అష్రిప్, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, దాదే అమృతమ్మ, దోరేపల్లి శ్వేత, ప్రశాంతలక్ష్మి, మందడపు లక్ష్మి, తోట ఉమారాణి, ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, గోళ్ల చంద్రకళ వెంకట్, బుడిగెం శ్రీను, రాపర్తి శరత్, బుర్రి వెంకట్కుమార్, పగడాల శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో సంబురాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించడంతో యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని తెలంగాణ భవన్లో పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి సంబురాలు చేశారు. స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించడం అభినందనీయమన్నారు. బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, మంచికంటి నరేశ్, లింగనబోయిన సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో..
నగరంలోని తన క్యాంపు కార్యాలయాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇంటిగా మార్చుకున్నారు. ఈ సందర్భం, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మేయర్ పునుకొల్లు నీరజ, రామబ్రహ్మం దంపతులు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, హిమబిందు దంపతులు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, శ్రీవిద్య దంపతులు బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
52వ డివిజన్లో..
నగరంలోని 52వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు బత్తుల తిరుమలరావు, రజినిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీ(టీ)ఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు కట్ చేశారు. సూత్రాల శ్రీను, ఎస్డీ ఖాదర్, క్రాంతి కుమార్, ఖలీల్పాషా తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపాలెంలో..
రఘునాథపాలెం, అక్టోబర్ 5: రఘునాథపాలెం మండంలోనూ బీఆర్ఎస్ ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి జాతీయ పార్టీని ఆహ్వానించారు. చిమ్మపూడిలో వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు గొర్రె శ్రీనివాసరావు, దొంతు సత్యనారాయణ, గుండ్ల ముత్తయ్య, గంగిరెడ్డి విజయ్రెడ్డి, మద్దుల నాగేశ్వరరావు, కంపసాటి వేణు తదితరులు పాల్గొన్నారు.