పాల్వంచ రూరల్, అక్టోబర్ 4 : పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ వసంత నవరాత్రి ఉత్సవాలు గత నెల 26వ తేదీ నుంచి ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసురమర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి రోజు జరిగే నిత్య పూజా కార్యక్రమాలతోపాటు దంపతిపూజ, సహస్రదీపాలంకరణ, చండీహోమం, లక్ష కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పలువురు దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మహీపతి రామలింగం, ధర్మకర్తలు పాల్గొన్నారు.
గౌతంపూర్లో..
చుంచుపల్లి, అక్టోబర్ 4 : మండలంలోని గౌతంపూర్లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్ధనిదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారి ఆశీస్సులు తప్పక ఉండాలి ; ఎమ్మెల్యే వనమా
పాల్వంచ రూరల్, అక్టోబర్ 4 : ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు తప్పక ఉండాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా అమ్మ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. కొత్వాల శ్రీనివాసరావు, కట్ట సతీశ్, మోహనకృష్ణ, రాంబాబు, నాగరాజు, శ్రీను, శివన్నారాయణ, హరి, సంతోశ్, ప్రసాద్, శివ, ఏ.శ్రీను పాల్గొన్నారు.
పాల్వంచలో జగదాంబ విగ్రహ ప్రతిష్ఠ
పాల్వంచ రూరల్, అక్టోబర్ 4 : మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్- గాజులగూడెం రోడ్డులో జగదాంబ భవాని విగ్రహ ప్రతిష్ఠ మంగళవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో సేవాలాల్ కమిటీ బాధ్యులు నూనావత్ సురేశ్, సాధు శంకర్, మాలోత్ కోటేశ్వరరావు, దాబా శంకర్, బోడ శేఖర్, మోహన్, కిషన్ ఆనంద్ పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న జీఎం దంపతులు
రామవరం, అక్టోబర్ 4 : కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్, గౌతంపూర్లోని కనకదుర్గ అమ్మవారి మండపాలను ఏరియా జీఎం జక్కం రమేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా జీఎం దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, రమణారెడ్డి, జగన్మోహన్, నర్సింగ్హోం, సమ్మయ్య, యాకయ్య, రాములు, రాంసింగ్, రవి కన్నయ్య, సత్యనారాయణ, రాజు, శ్రీనివాస్, చంద్రమౌళి పాల్గొన్నారు.