ఖమ్మం, అక్టోబర్ 2: గాంధీ మార్గం అనుసరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీచౌక్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం, రోటరీ నగర్లో గాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించి అనంతరం మాట్లాడారు. గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆచరించిన అహింసా మార్గం నేటి తరానికి ఆదర్శమన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, పోలిస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్.మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, నాయకులు ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, తాజుద్దీన్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గాంధీ నివాళి
గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రజలు మహాత్ముడికి ఘనంగా నివాళి అర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గాంధీజీ సేవలను కొనియాడారు. ఆయన సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పలుచోట్ల స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.